చంద్రబాబు, ఆయన మంత్రులు ఫొటోలు దిగేందుకే వెళుతున్నారు: ఎమ్మెల్యే రోజా

  • అక్కడి ప్రజల కష్టాలు చూస్తుంటే మనసు కరిగిపోతోంది
  • పునరావాస చర్యల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది
  • రియల్ టైమ్ గవర్నెన్స్ సరే, ‘తిత్లీ’ని ముందుగా కనిపెట్టలేదే?
‘తిత్లీ’ బాధితులకు పునరావాస చర్యల్లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే మనసు కరిగిపోతోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా తనది రియల్ టైమ్ గవర్నెన్స్ అని, తన కారు డ్యాష్ బోర్డులో ప్రతిదీ ఉంటుందని గొప్పలు చెప్పుకుంటారని, అలాంటిది, ‘తిత్లీ’ని ముందుగానే ఎందుకు కనిపెట్టలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గానీ, ఆయన మంత్రులు గానీ ఫొటోలు తీసుకునేందుకే అక్కడికి వెళుతున్నారని విమర్శించారు. ఇప్పటికి మూడు రోజులు అవుతున్నప్పటికీ గ్రామాల్లో విద్యుత్ లేదని, పాలు, నీళ్లు అందించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
roja
titli

More Telugu News